Wednesday 29 January 2014

భగవద్గీత ఏం చెబుతుంది ?

భగవద్గీత ఏం చెబుతుంది ?
      ధర్మాధర్మాల గురించి చెబుతుంది. కర్తవ్యం గురించి చెబుతుంది. నాగరికత అంటే కోరికలను తీర్చుకోవటం కాదు...అదుపులో పెట్టుకోవడమని చెబుతుంది. సుఖం..శాంతి..త్యాగం...యోగం... అంటే ఏమిటో చెబుతుంది. ఆనందంగా జీవించడం ఎలాగో చెబుతుంది.ఏది శాశ్వతమో...ఏది అశాశ్వతమో చెబుతుంది. పాపపుణ్యాల వివరణ ఇస్తుంది. స్వకల్యాణం కోసం కాక లోక కల్యాణం కోసం జీవించమని చెబుతుంది. జ్ఞానం...మోక్షం...బ్రహ్మం...ఆధ్యాత్మం అంటే ఏమిటో చెబుతుంది. ఎవడు పండితుడో ఎవడు స్థితప్రజ్ఞుడో చెబుతుంది. మంచి పనులు చేసేవాడికి లభించే శాశ్వత కీర్తి ఎంతో చెబుతుంది.కర్మ, భక్తి, జ్ఞాన, మార్గాల ద్వారా వేలు పట్టుకొని నడిపించి, మనిషిని దైవాన్ని చేస్తుంది. అనారోగ్యకరమైన భావోద్వేగాలను నియంత్రిస్తుంది.





సేకరణ : సాక్షి ఆదివారం పుస్తకం

No comments:

Post a Comment